హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): మహిళల సాధికారతకు హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ సహకారం అందిస్తుందని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చెప్పారు. హైదరాబాద్ కాన్సులేట్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (కేఐఐటీ), టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (టీబీఐ) సంయుక్తంగా రూపొందించిన ‘అకాడమీ ఆఫ్ ఉమెన్ అంత్రప్రెన్యూర్స్ ప్రోగ్రాం’ను జెన్నిఫర్ లార్సన్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ, ఒడిశా, ఏపీల్లోని వివిధ ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళలు తమ వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకొని, ఆర్థికంగా రాణించి, రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. ఈ నెల 13, 27 తేదీల్లో తెలంగాణలో కార్యక్రమాలు ఉంటాయన్నారు.