హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 26న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘాల నేతలు ఊరూరా ఘనంగా నిర్వహించాలని ఎంబీసీల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కోరారు. ఈ విషయమై ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ పోరాట యోధులకు సముచితగౌరవం లభిస్తున్నదని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించాలని ప్ర భుత్వం ఇప్పటికే నిర్ణయించిందని, ఇందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞ తలు తెలుపుతున్నామని తెలిపారు.