రామగుండం: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో (RFCL) మరోసారి ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్మోనియా ప్లాంట్లో వాయువులు లీకవడంతో అధికారులు యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే ప్రధాని పర్యటనకు రెండు రోజుల ముందు ఉత్పత్తికి బ్రేక్పడటంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఎరువుల తయారీ కొనసాగుతున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ ఈ నెల 12న జాతికి అంకితం చేయనున్నారు. కాగా, మోదీ పర్యటన నేపథ్యంలో మెంటేనెన్స్ చేయడంతో మళ్లీ లీకేజీలు ప్రారంభమయ్యాయని, ఫ్యాక్టరీలో వాయువులు లీకవడం ఇది కొత్తేమీ కాదని స్థానికులు అంటున్నారు.
ఫ్యాక్టరీలో గతంలో కూడా అమ్మోనియం వాయువు లీకయింది. అరగంట పాటు గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్యాస్ లీకేజీతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.