రామగిరి, మార్చి 12: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం నల్లమల పరిధిలోని పెద్దగట్టు, సాంబాపురం ప్రాంతాల్లో యురేనియం సర్వే జరుపలేదని మైన్స్ అండ్ జియాలజీ నల్లగొండ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న పీఏపల్లి తహసీల్దార్తో కలిసి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేశామని, గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు కూడా యురేనియం అన్వేషణ లేదని స్పష్టంగా చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.
యురేనియం తవ్వకాలు వద్దంటూ 2019 సెప్టెంబర్, 2022 సెప్టెంబర్లో శాసన సభ, శాసనమండలిలో వరుసగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వా న్ని అభ్యర్థించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలను చూసి నల్లమల ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.