హైదరాబాద్ సిటీబ్యూరో,డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని ప్లాట్లకు గురువారం నిర్వహించిన తొలి విడత వేలంపాటకు విశేష స్పందన లభించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, కేంద్ర ప్ర భుత్వం రంగసంస్థ ఎమ్మెస్టీసీ ఆధ్వర్యంలో 23 ప్లాట్లకు ఈ-ఆక్షన్ నిర్వహించారు. 23 ప్లాట్లలో 19,719 గజాల స్థలాన్ని విక్రయానికి ఉంచగా దాదాపు రూ.141 కోట్ల ఆదా యం వచ్చింది. గజంధర అత్యధికంగా రూ. 1,01,000, కనిష్ఠంగా ఒక ప్లాట్కు రూ.53 వేలు పలికింది. చాలా ప్లాట్లకు గజం ధర రూ.66 వేలపైన కోట్ చేశారు. శుక్రవారం 20 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు.