Pepsi Sharma : హరియాణాకు చెందిన ప్రముఖ యువ జానపద గాయకుడు పెప్సీ శర్మ (38) గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంతో అభిమానులు, తోటి కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పెప్సీ శర్మకు గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. పెప్సీ శర్మ అసలు పేరు యశ్పాల్ శర్మ. ఆయన హరియాణాలోని ఘజియాబాద్లోని పాట్లా గ్రామానికి చెందిన వారు. ఆయనకు హరియాణాతోపాటు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో మంచి గాయకుడిగా పేరుంది. అలాగే, ఆయన రాగిణి కళాకారుడు కూడా. నాగిని డ్యాన్స్తో కూడా వినోదం పంచారు. ముఖ్యంగా ఆయన చేసిన ఈ డ్యాన్స్ చాలా గుర్తింపు తీసుకొచ్చింది. రాగిణి ఈవెంట్స్, స్టేజిపై స్థానిక జానపద పాటలు పడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ షోలలో కూడా పాల్గొన్నారు.
दुखद खबर: हरियाणवी कलाकार पेप्सी शर्मा का निधन हो गया। सीने में दर्द के बाद उन्होंने अंतिम सांस ली।
UP और हरियाणा की रागनी दुनिया में उनकी पहचान एक दमदार कलाकार के रूप में थी।
भावपूर्ण श्रद्धांजलि।#PepsiSharma #RIP #HaryanviArtist #Ragni pic.twitter.com/5EsfS3qXI8
— Payall Singhh (@PayallSingh13) June 8, 2026
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, బాద్షా వంటి వారి ముందు ఆయన తన ప్రదర్శన ఇచ్చారు. ఆయన చేసిన నాగిన డ్యాన్స్ సహా అనేక వీడియోలకు యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. పెప్సీ శర్మ మృతిపై హరియాణాకు చెందిన రాజకీయ నేతలు, అభిమానులు సంతాపం ప్రకటించారు.