హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షల పెంపు పథకాలకు సంబంధించిన రీయింబర్స్మెంట్ను నెలవారీగా చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మం డలిలో గవర్నర్కు ధన్యవాద తీ ర్మానంపై జరిగిన చర్చలో నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరారు.