లండన్, జూలై 6 : భారత్లో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు రప్పించేందుకు మార్గం సుగమమైంది. అతడ్ని భారత్కు అప్పగించటంలో యూకేలో చట్టపరమైన అడ్డంకి తొలిగిపోయింది.
యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్ఆర్)లో నీరవ్ మోదీ చేసిన చట్టపరమైన చివరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అతడ్ని భారత్కు రప్పించటం దాదాపు ఖాయమైందని భారత దౌత్య వర్గాలు చెబుతున్నాయి.