లండన్, జూలై 6 : భారత్లో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు రప్పించేందుకు మార్గం సుగమమైంది. అతడ్ని భారత్కు అప్పగించటంలో యూకేలో చట్టపరమైన అడ్డంకి తొలిగిపోయింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్ఆర్)లో నీరవ్ మోదీ చేసిన చట్టపరమైన చివరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అతడ్ని భారత్కు రప్పించటం దాదాపు ఖాయమైందని భారత దౌత్య వర్గాలు చెబుతున్నాయి.
యూకే కోర్టుల్లో అప్పీల్ చేయడానికి ఉన్న అన్ని దారులను వినియోగించుకున్న నీరవ్ ఈ ఏడాది ఏప్రిల్లో ఈసీహెచ్ఆర్ను ఆశ్రయించారు. కాగా..యూకే కోర్టు ఆయనకు ఉపశమనం కల్పించలేదని, దీంతో అతడికి తదుపరి చట్టపరమైన మార్గాలు ఏవీ అందుబాటులో లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. చట్టపరమైన ప్రక్రియ ముగియటంతో..నీరవ్ను భారత అధికారులకు అప్పగించడానికి అవసరమైన పరిపాలనా ప్రక్రియను యూకే ప్రభుత్వం చేపట్టిందని తెలిసింది.