హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభు త్వ ఇసుక విధానం బాగున్నదని ఉత్తరప్రదేశ్ అధికారులు ప్రశంసించారు. ఇక్కడి విధానాన్ని అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలుచేసేందుకు వచ్చిన అధికారులు శనివారం టీఎస్ఎండీసీ అధికారులతో భేటీ ఆయ్యా రు. తెలంగాణ ఇసుక పాలసీ గురించి టీఎస్ఎండీసీ చైర్మన్ మన్నె క్రిశాంక్, ఎండీ మల్సూరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణ ఏర్పడే నాటికి ఇసుక మీద ప్రభుత్వానికి ఏడాదికి రూ.28 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చేదని క్రిశాంక్ తెలిపా రు. సీఎం కేసీఆర్ రూపొందించిన నూతన పాలసీతో 2022 నాటికి ఇసుకపై రూ.5 వేల కోట్లకుపైగా ఆదా యం వస్తున్నదని చెప్పారు. బృందం లో గనుల శాఖ కార్యదర్శి వినీత్కుమార్ జైన్, గనులశాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్కే సింగ్ ఉన్నారు.