నాట్లు వేసిన పురుషులు
ఓదెల: నారు తీయడం.. నాటు వేయడం మహిళలు చేయడం సాధారణమే.. అదే పని పురుషులు చేస్తే ఆశ్చర్యమే.. పైచిత్రంలో నాట్లు వేస్తూ కనిపిస్తున్న వారు ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు. రాష్ట్రం లో వరిసాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో మహిళా కూలీల కొరత ఏర్పడింది. ఫలితంగా రైతులు ఇతర రాష్ర్టాల కూలీలను ఆశ్రయిస్తున్నారు. యూపీకి చెం దిన మగ కూలీలు నాటువేయడంలో ప్రత్యేకం కావడంతో వారిని రప్పించుకుంటున్నారు. ఈ క్రమం లో 15 మంది కూలీలు పెద్దపల్లి జిల్లా ఓదెల మండ లం కొలనూర్ వచ్చి రైతు దేవిడి రంగారెడ్డికి చెందిన పొలంలో శుక్రవారం నాట్లు వేశారు. వీరు ఎకరాకు రూ.4,500 తీసుకుంటున్నారు. వీరు ఒక రోజులో నారు తీసి, 5 నుంచి 6 ఎకరాలు నాటు వేస్తారు.