హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు అందించే కేంద్రాలుగా కాకుండా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సామర్థ్యం, పరిశోధన ఆధారిత వృద్ధిపై దృష్టి సారించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. గురువారం లోక్భవన్లో వర్సిటీల వీసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపకులపతులు స్వయంగా తరగతులు బోధిస్తూ విద్యా నాయకత్వానికి ఆదర్శంగా నిలువాలని కోరారు. ప్రభుత్వం కోర్సుల రూపకల్పన, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి జాతీయ కార్యక్ర మాలపై దృష్టిసారించాలని తెలిపారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ఉన్నత విద్య, పరిశోధనలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఈ పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, ఆయా వర్సిటీల వీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.