విద్యానగర్, జూన్ 23: నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ సమితి కన్నెర్రజేసింది. పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంపై నోరు మెదపని కేంద్రమంత్రి బండి సంజ య్ ఇంటిని ఆదివారం ముట్టడించింది. బండికి కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హకు లేదని మం డిపడింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌ రస్తా నుంచి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ క్యాంపు ఆఫీస్ వద్దకు ర్యాలీగా వెళ్లి ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. విద్యార్థులు, నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బండి సంజయ్కి మత రాజకీయాలపై ఉన్న శ్రద్ధ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్పై లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీలకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉద్య మం చేస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే ‘చాయ్ పే చర్చ’ మాదిరిగా.. నీట్ పేపర్ లీకేజీపై చర్చించాల్సిందిగా మోదీని అడగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మునిగంటి అనిల్, నేతలు బాలసాని లెనిన్, రామారావు వెంకటేశ్, మచ్చ రమేశ్, అరవింద్, గజ్జల శ్రీకాంత్, రాణా ప్రతాప్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.