హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలో తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం పేరు చెప్పాలని తాను విసిరిన సవాల్కు ఇంతవరకు ఒ క్క కేంద్ర మంత్రి కూడా స్పందించలేదని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
తొమ్మిదేండ్లలో తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం పేరు చెప్పాలని, ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులకు సవాల్ విసిరానని బుధవారం ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే ప్రధాని సహా కేంద్రంలోని ఏ మంత్రి కూడా ఇంతవరకు స్పందించలేదని, దీంతో వారి దగ్గర సరియైన సమాధానం లేదన్న సంగతి తేలిపోయిందని ఎద్దేవా చేశారు.