తెలంగాణలో గత ఎనిమిదేండ్లుగా అవినీతి ప్రభుత్వం నడుస్తున్నది. రాష్ట్రంలో రైతులు అవమాన పడుతున్నారు. కూలీలకు ఉపాధి హామీ పనులు దొరకలేదు. ప్రధాని మోదీ దేశమంతటా అమలుచేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో నోచుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది.
– ఆదివారం సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో, అధునాతన ఎకోసిస్టమ్ను నిర్మించడంలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం సైన్స్, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ హైదరాబాద్ (రిచ్) పేరుతో ఇంక్యుబేటర్ను ప్రారంభించడమే కాకుండా అనేక కార్యక్రమాలను చేపట్టింది.
– మంగళవారం ఢిల్లీలో స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్