Covid-19 | హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉండాల్సిన ఆవశ్యకతను కరోనా మహమ్మారి గుర్తు చేసిందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్పవార్ చెప్పారు. మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితులు వచ్చే ప్రమాదముందని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి సమష్టిగా ముందుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ నోవాటెల్లో జీ-20 దేశాల 30వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యా యి.
మూడురోజులపాటు జరిగే సమావేశాల్లో తొలిరోజు భారతి ప్రవీణ్ హాజరై మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రపంచ దేశాల మధ్య సహకారం, సమన్వయం తప్పనిసరని తెలిపారు. ఐఎన్బీ ప్రక్రియ ద్వారా పనిచేసే ఒక తాత్కాలిక వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాలని జీ20 దేశాలకు సూచించారు. కార్యక్ర మంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, ఎస్పీ సింగ్ బాఘెల్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ఉన్నతా ధికారులు డాక్టర్ రాజీవ్ బెహల్, ఠాకూర్, లవ్ అగర్వాల్, హెకాలి జిమోమీ పాల్గొన్నారు.