Bifurcation Issues | కేంద్ర హోంశాఖ కార్యాలయంలో తెలంగాణ, ఏపీ అధికారులు భేటీ అయ్యారు. ఇటీవల హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన తొలిసారిగా సోమవారం విభజన చట్టంపై సమీక్ష చేపట్టిన గోవింద్ మోహన్ చర్చించారు. ఈ సందర్భంగా విభజనచట్టంలోని 9, 10వ షెడ్యూల్లోని అంశాలపై రెండేళ్ల సుదీర్ఘ సమీక్షించారు. ఆస్తులు, అప్పులపై ఎక్కువగా చర్చించారని తెలుస్తుండగా.. సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఉన్నాయని చెప్పారని.. సానుకూల వాతావరణంలో సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నట్లుగా వెల్లడించినట్లు తెలుస్తున్నది. భేటీలో విదేశీ సంస్థల నుంచి తీసుకున్న అప్పుల పంపకంపై చర్చించారని.. అప్పుల పంపకంపై న్యాయ సలహా మేరకు నడుచుకోవాలన్నట్లుగా చెప్పారని.. దీనికి న్యాయ సలహాపై తమ ఏజీల అభిప్రాయం తీసుకుంటామన్న ఏపీ, తెలంగాణ అధికారులు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయితే, ఏజీల అభిప్రాయం మేరకు మరోసారి భేటీలో నిర్ణయం తీసుకుందామని కేంద్ర కార్యదర్శి చెప్పారని.. అదే సమయంలో సంస్థల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాలపై కీలక సూచనలతో పాటు 9, 10 షెడ్యూల్లోని 20 సంస్థల నిధుల పంపకంపై సానుకూలంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారుల స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించారని.. అధికారుల స్థాయిలో కాకుంటే ప్రభుత్వ అధినేతలతో చర్చించి కొలిక్కి తేవాలని చెప్పినట్లుగా టాక్. ఎక్కువ వాటాకు పట్టుబడితే ఇద్దరికీ నష్టమని హితవుపలకాలని.. అభిప్రాయ భేదాలతో కోర్టులకు వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేమన్నట్లుగా కేంద్ర కార్యదర్శి అన్నట్లు తెలిసింది. కోర్టుకు వెళ్తే తాను ఏమీ చేయలేమని.. కేసు ఎప్పటికి తేలుతుందో చెప్పలేమనట్లుగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసిందని సమాచారం. అయితే, మౌలిక వసతుల ప్రాజెక్టులకు తమ మద్దతు ఉంటుందని కార్యదర్శి హామీ ఇచ్చినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.