హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే’ సందర్భంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించిన ‘రోగి సురక్ష సప్తాహ్’ అవార్డులు తెలంగాణను వరించాయి. 2018-19, 2020-21 కాలానికి మెరుగైన సేవలందించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల క్యాటగిరీలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రాంపల్లిలోని పీహెచ్సీ, ఖమ్మం జిల్లా బోనకల్ పీహెచ్సీ, యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ పీహెచ్సీలను అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ శుక్రవారం ప్రకటించారు. యూపీహెచ్సీ క్యాటగిరీలో రన్నరప్ అవార్డులను మరికొన్ని దవాఖానలు పొందాయి. కారిడార్లు, ఇన్పేషెంట్ వార్డు, న్యూబార్న్ కేర్ కార్నర్, ఫార్మసీ స్టోర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉండటతో ఈ అవార్డులు దక్కాయి.