హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వ్యవసాయంలో దశలవారీగా యాంటిబయాటిక్స్ వాడకాన్ని నిషేధించాలని కేంద్రం నిర్ణయించింది. యాంటిబయాటిక్స్ వాడకంతో పంటలు, జంతువుల్లో యాంటి మైక్రోబయాటిక్స్ వ్యాపిస్తున్నాయని, వీటిని వినియోగించే మనషుల్లో రోగనిరోధక శక్తి క్షీణించటంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రభుత్వం భావిస్తున్నది.
ఐసీఎంఆర్ సిఫారసుతో స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ యాంటిబయాటిక్స్ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు 2021 డిసెంబర్ 17న కేంద్ర వ్యవసాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.