హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల కేటాయింపులో భాగంగా మిగిలిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలని స్పౌజ్ బాధితులు మంగళవారం ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించారు. మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, సీతక్క, దామోదర్ రాజనర్సింహను కలిసి వారు వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మమత, త్రివేణి, సౌజన్య, నరేశ్, వివేక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.