మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ బాలికపై మేనమామ, వరసకు సోదరులు అయ్యే ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
మహారాష్ట్రకు చెందిన బాలిక (13) తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట మరణించడంతో కీసరలోని అమ్మమ్మ ఇంట్లో ఉంది. స్థానికుల సహాయంతో తుర్కపల్లిలోని వసతీగృహంలో చేరింది. ఇటీవల సెలవులు కావడంతో కీసరలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అప్పుడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మేనమామతో పాటు వరసకు సోదరులైన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత బాలిక మళ్లీ వసతీగృహానికి వెళ్లిపోయింది. అక్కడ ఫ్యాన్ తగిలి గాయాలు కావడంతో చికిత్స అనంతరం ఇటీవల మళ్లీ అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో లైంగిక దాడికి సంబంధించిన విషయం బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.