హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో ముందున్న రాష్ట్ర ప్రభుత్వం అన్బ్లాక్ 4.0 సింపోజియం, బ్లాక్ చెయిన్ హ్యాకథాన్ నిర్వహణకు సిద్ధమైంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగాన్ని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డీఎల్టీ ల్యాబ్స్తో కలిసి వర్చువల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల 21నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించే వర్చువల్ బ్లాక్ చెయిన్ సింపోజియంకు ప్రముఖ టెక్ నిపుణులు హాజరవుతారు. ఇందులో పాల్గొనే వారు https://unblock.dltlabs.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.