బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 7 : మారుమూల ప్రాంతమైన తమ గ్రామానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే తామంతా ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్థులు ప్రకటించారు. గ్రామానికి చెందిన అంబేద్కర్, దండోరా, మరాఠా, గంగపుత్ర, కాపు, ముదిరాజ్, కురుమ తదితర సంఘాల కుల పెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేసి గురువారం ఆ ప్రతిని స్పీకర్కు అందజేశారు. రాయకూర్ గ్రామాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తూ.. అన్నీ తానై నిలిచిన స్పీకర్ రుణం తీర్చుకోలేమని వారు స్పష్టం చేశారు. తమవంతు సాయంగా రాబోయే ఎన్నికల్లో స్పీకర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రకటించారు. గ్రామంలో బీఆర్ఎస్ జెండా తప్ప వేరే పార్టీల జెండాను ఎగరనివ్వబోమని వారు స్పష్టం చేశారు.