కవాడిగూడ, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి నియామకమే ఇందుకు నిదర్శనమని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన న్యాయవాది దేవేందర్రెడ్డి అసంఘటిత బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రమశిక్షణతో పనిచేసే ప్రతి కార్యకర్త, నాయకుడికి సీఎం కేసీఆర్ గౌరవం ఇస్తున్నారని అన్నారు. లేబర్ వెల్ఫేర్బోర్డు చైర్మన్గా దేవేందర్రెడ్డి.. అసంఘటితరంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. ఆర్థికమంత్రి టీ హరీశ్రావు మాట్లాడుతూ పార్టీకోసం శ్రమించి పనిచేసిన వ్యక్తి దేవేందర్రెడ్డి అని చెప్పారు. ఆయనకు పదవి ఇవ్వడం ఉమ్మడి మెదక్ జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్యాదవ్, ఎలక్షన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.