శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్ర ప్రధానాలయ ప్రాంగణంలోని ఉమామహేశ్వర ఆలయం వద్ద భక్తులు నేరుగా దర్శనం చేసుకునేందుకు ఉమామహేశ్వర వ్రతాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. కోవిడ్ కారణంగా గతంలో పలు ఆర్జిత సేవలు నిలిపివేయగా భక్తుల అభీష్టం మేరకు ఈ వ్రతాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ వ్రతంలో పాల్గొనదలిచినవారు దేవస్థాన ఆర్జితసేవా టికెట్ కౌంటర్ వద్ద రూ. 5000 రుసుము చెల్లించవలసి ఉంటుందని చెప్పారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నృత్యకళా నివేదన చేశారు. శనివారం సాయంత్రం ఆలయ దక్షిణ మాడవీధిలో ధర్మపథం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు చెందిన శ్రీ లక్ష్మీప్రసూన్న అకాడమి వారు పలు భక్తితాలకు సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఆలయ పీఆర్వో శ్రీనివాసరావు ఆధ్వర్యలో నిర్వహిస్తున్న కళారాధన కార్యక్రమానికి యాత్రికుల నుండి విశేష స్పందన లభిస్తుందని ఈవో అన్నారు.