హైదరాబాద్: ప్రగతి భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణం కొనసాగుతున్నాయి. బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేస్తున్నారు. చీకటిరోజులు తొలగిపోయి మంచిరోజులు వచ్చాయని చెప్పారు. శుభకృత్ నామ సంవత్సరంలో భూమండలమంతా అద్భుతమైన ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఏడాదంతా అందరూ ఆనందంగా ఉంటారని తెలిపారు. ప్రజారోగ్యం బాగుంటుదని, మాస్కులు అవసరం ఉండదన్నారు.
పరిపాలన అద్భుతంగా జరుగుతున్నదని వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. వేసవిలోనూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. జూలై నెల మధ్య నుంచి రైతులకు అద్భుతమైన కాలమని చెప్పారు. దేశం దృష్టంతా హైరదాబాద్పైనే ఉంటుందన్నారు. తెలంగాణ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు.