హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం తెలంగాణభవన్లో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హాజరు కానున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.