తిమ్మాపూర్/చిగురుమామిడి/హుస్నాబాద్, ఏప్రిల్ 7: గుండెపోటుతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందా రు. మక్క చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్తూ ఒకరు, క్రికెట్ ఆడుతూ మరొకరు మృత్యుఒడికి చేరారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లికి చెందిన జీల సతీశ్ (32) శుక్రవారం ఉదయం 6 గంటలకు మక్క చేనుకు నీళ్లు పెట్టేందుకు బైక్పై వెళ్తుండగా హఠాత్తుగా కిందపడిపోయి, మృతిచెందారు. సతీశ్కు భార్య కవిత, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నా రు.
హుస్నాబాద్లో జరిగిన మరో ఘటనలో క్రికెట్ ఆడుతున్న యువకుడు హఠాన్మరణం చెందాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన శనిగరం ఆంజనేయులు (37) హుస్నాబాద్లో జరిగిన ఓ క్రికెట్ టోర్నీలో బౌలింగ్ చేస్తూ గ్రౌండ్లోనే కుప్పకూలి, మృత్యుఒడికి చేరాడు.