హైదరాబాద్, మే 31, (నమస్తే తెలంగాణ): పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను రెండేండ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతి పాసై, టీఎస్ పాలీసెట్-2023లో ఉత్తీర్ణులైన అగ్రికల్చర్ స్ట్రీమ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీ పరిధిలో మహబూబ్నగర్, మామునూరు, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో నాలుగు కళాశాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 121 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు ఏపీలోని కృష్ణా జిల్లా బావదేవరపల్లిలోని మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్లో 11 సీట్లు ఉన్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం జ్ఞానప్రకాశ్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 19లోగా www.tstu.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.