గరిడేపల్లి, సెప్టెంబర్ 10 : వన భోజనాలకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీ పల్టీ కొట్టడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్చెర్వులో ఆదివారం జరిగింది. కల్మల్చెర్వుకు చెందిన బిళ్ల సైదులు కుటుంబంతో ట్రాక్టర్లో అలింగాపురం శివారులోకి వనభోజనాలకు వెళ్లాడు. సాయంత్రం ట్రాక్టర్లో ఇంటికి బయల్దేరారు. రేగులకుంట చెరువు వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి ట్రాలీ విడిపోయి రోడ్డు పక్కనే 25 అడుగుల లోతున పొలంలో బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాలీ కింద పడిపోయిన కల్మల్చెర్వు గ్రామానికి చెందిన బిళ్ల మనీష (24), ఆమె చిన్నమ్మ ఏపీలోని గుడివాడకు చెందిన గోలి చంద్రమ్మ (45) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.