తిరుమల : తిరుమల శ్రీవారికి టీవీఎస్ మోటార్స్ సంస్థ నూతన మోడల్ రొనిన్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా శుక్రవారం అందించింది. 225 CC సామర్థ్యం గల ఈ వాహనం ధర రూ.1,81,845 అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీవీఎస్ సంస్థ చైర్మన్ వేణుశ్రీనివాసన్, ఎండీ సుదర్శన్ వేణు తరఫున సంస్థ ప్రతినిధి కె.వరదరాజన్ వాహనం పత్రాలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సిద్ధార్థ్, తిరుపతి శ్రీనివాస టీవీఎస్ డీలర్ రాజా రెడ్డి, తిరుమల డీఐ జానకీరామ్ రెడ్డి పాల్గొన్నారు.