హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ శాఖలో టీపీబీవో పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించనున్న, ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను తాత్కాలికంగా వాయి దా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.
టీఎస్పీఎస్సీ కంప్యూటర్ హ్యాక్ అయ్యిందని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ రెండు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని, కంప్యూటర్ హ్యాక్ అయిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.