హుజూరాబాద్టౌన్/స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 21: అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన డాక్టర్ నవీన్, స్వాతి దంపతుల పెద్ద కుమారుడైన ముక నివేశ్ (20), జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన కమల్కుమార్ గుప్తా, పద్మ దంపతుల కుమారుడైన గౌతంకుమార్(20) అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ (సీఎస్) సెకండియర్ చ దువుతున్నారు. శనివారం ఉదయం వీరిద్దరితోపాటు కళాశాలకు చెందిన మరో ఇద్దరు స్నేహితులు కలిసి వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా రాత్రి 11.30 గంటల (అమెరికా కాలమానం ప్రకారం)కు వెనుక నుంచి వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో వెనుక సీట్లో కూర్చొన్న నివేశ్, గౌతంకుమార్ మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారన్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ నివేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.