హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): గొర్రెల స్కాంలో ఏసీబీ కేసు నమోదు కాకముందే ఏ1, ఏ2 నిందితులు విదేశాలకు పారిపోయినట్టు సమాచారం. ఈ స్కాంలో ఏ1గా సయ్యద్ మొయినొద్దీన్, ఏ2గా సయ్యద్ ఇక్రముద్దీన్ ఆహ్మద్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిని ఆ ఇద్దరు ప్రధాన నిందితులు విదేశాల నుంచే బెదిరిస్తున్నట్టు సమాచారం. ఇదే కేసులో గురువారం నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.