Accident | నిజామాబాద్ క్రైం/భీమ్గల్, జూన్ 3: అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతలసత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు శైలేష్(21) బీటెక్ పూర్తిచేసి ఉన్నత విద్య కోసం గతేడాది న్యూజెర్సీకి వెళ్లాడు. శనివారం అతడు కారులో వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొన్నది.
శైలేష్ ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగడంతో అతడు మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని న్యూజెర్సీ అధికారులు మృతుని కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శైలేష్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని బంధువులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి విన్నవించారు.