శంషాబాద్ రూరల్, ఆగస్టు 8: దుస్తుల్లో దాచుకొని బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వారు దుస్తుల్లో దాచుకొని తెచ్చిన 1,527 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల వద్ద లభించిన బంగారం విలువ రూ. 93.26 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.