హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు ప్రైవేట్ వర్సిటీలు ఏర్పాటుకానున్నాయి. వీఎన్నార్ విజ్ఞానజ్యోతి, శ్రీఇందు విద్యాసంస్థలు ప్రైవేట్ వర్సిటీలను నెలకొల్పనున్నాయి. ఈ రెండు వర్సిటీల ప్రతినిధులు గురువారం నాంపల్లిలోని రూసా రిసోర్స్ సెంటర్లో నిపుణుల కమిటీ ముందు ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ, జేఎన్టీయూ వీసీలు డీ రవీందర్, కట్టా నర్సింహారెడ్డి పాల్గొన్నారు.