శేరిలింగంపల్లి, మార్చి 20: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వినీత్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే పాతబస్తీకి చెందిన మీర్జా వహీద్ బేగ్ను అరెస్టు చేసి విచారణ చేపట్టగా, ముషీరాబాద్కు చెందిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తెలిపింది.
దీంతో మాదాపూర్ ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు అబ్దుల్ రెహమాన్ కోసం గాలింపు చేపట్టగా, చివరికి సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. రెహమాన్తో పాటు అతడికి సహకరిస్తున్న ఢిల్లీ, మహిపాల్పురాకు చెందిన మిలాన్సీ నరేంద్రసవానత్ను సైతం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వీరి నుంచి రూ.కోటి విలువైన 11 గ్రా ముల ఎండీఎంఏ డ్రగ్, 7 సెల్ఫోన్లు, ఒక జాగ్వార్ కారును స్వాధీనం చేసుకున్నారు.