హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): జీఆర్ఈ, టోఫెల్ ఆన్లైన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న రెండు ముఠాల్లోని నలుగురిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జాయింట్ సీపీ గజరావు భూపాల్ చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన శ్రావణ్కుమార్, ఆదిత్య రాయ్పూర్ నిట్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. జీఆర్ఈ, టోఫెల్లో మంచి స్కోర్ తెప్పిస్తామంటూ సోషల్మీడియాలో ప్రకటనలిస్తూ.. తమను సంప్రదించిన వారి నుంచి రూ.20 వేలు తీసుకొని, హస్తినాపురంలోని స్నేహితుడి ఇంట్లో జీఆర్ఐ, టోఫెల్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసే వారి సీటు కింద కూర్చొని ఎవరికీ కనిపించకుండా పరీక్ష రాసే వారి స్క్రీన్ను ఫొటో తీస్తూ వాట్సాప్లో కిశోర్, సంతోష్ కలిసి శ్రావణ్కు పంపిస్తారు. శ్రావణ్ వాటికి సమాధానాలు తిరిగి పంపిస్తుంటాడు. గుణశేఖర్ అనే యువకుడు కూ డా ఇదే దందా సాగిస్తున్నాడు. గుణశేఖర్ వ్యవహారం టోఫెల్, జీఆర్ఈ పరీక్ష నిర్వహణ సంస్థ ఈటీఎస్ దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండాల శ్రావణ్కుమార్, మండాల సాయి సంతోష్, పీ కిశోర్, అర్కతాల కిరణ్కుమార్ను అరెస్ట్ చేశారు. ఆదిత్య, గుణశేఖర్ పరారీలో ఉన్నారు.