కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 20: తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా ఆర్నపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గాలింపు చేపట్టిన భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు, ఇన్సాస్ రైఫిల్, 12 బోర్ రైఫిల్ను స్వాధీనం చేసుకొన్నాయి.