హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నిషేధిత ఆల్ప్రజోలం డ్రగ్ ను తయారు చేస్తున్న వ్యక్తులను తెలంగా ణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అధికారులు బుధవారం అరె స్టు చేశారు.
రెండు వేర్వేరు కేసుల్లో సుమా రు రూ.1.77 కోట్ల విలువైన ఆల్ప్రజోలం డ్రగ్తోపాటు రూ.11.7 కోట్ల ముడి పదార్థాలు, ల్యాబ్ పరికరాలు, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.