హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఇద్దరు విద్యార్థులు 100 పర్సంటైల్తో అదరగొట్టారు. దేశంలో ప్రతిష్ఠాత్మక ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ, మేనేజ్మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్ను ఈ ఏడాది ఐఐఎం లక్నోలో నిర్వహించారు. విద్యార్థుల వారీగా ఫలితాలను వెబ్సైట్లో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 2.88 లక్షల మంది విద్యార్థులు క్యాట్ పరీక్ష రాశారు. వీరిలో 14 మంది 100 పర్సంటైల్ సాధించారు.
క్యాట్లో 72 మంది టాపర్లుగా నిలిచారు. 14 మంది 100, 29 మంది 99.99, మరో 29 మంది 99.98 పర్సంటైల్ సాధించారు. 100 పర్సంటైల్ను సాధించిన వారిలో అంతా ఇంజినీరింగ్ చదివిన అబ్బాయిలే ఉన్నారు.