హైదరాబాద్, నవంబర్ 18 (నమ స్తే తెలంగాణ): విశాఖపట్నంలోని భీమి లి బీచ్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. నగరంలోని సంగివలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు బీచ్కు వెళ్లారు.
స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ కెరటంతో సూర్య, సాయి అనే విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరుగగా, సాయంత్రం వరకు ఆచూకీ లభ్యం కాలేదు.