నల్లగొండ: నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. చింతపల్లి మండలంలోని వెంకటేశ్వర నగర్ వద్ద ఆగిఉన్న లారీని క్రూయిజర్ (cruiser) వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
మృతులను మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన రాములు, సత్తయ్యగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా కొల్కులపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.