భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ( Bibinagar) టోల్ప్లాజా సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున పూల లోడుతో వెళ్తున్న ఆటో ట్రాలీ టోల్గేట్ సమీపంలో ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఉద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం ధాటికి ట్రాలీ ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను పర్వతగిరి మండలం తోటపల్లికి చెందిన అనిల్, వరంగల్కు చెందిన ఖలీల్గా గుర్తించారు.
కాగా, అదే సమయంలో పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనా స్థలంలో ఆగారు. దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన విషయాలను తెలుకున్నారు. మృతులకు సంబంధీకులతో మాట్లాడి విచారం వ్యక్తంచేశారు. రోడ్లపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. అతివేగం, నిద్రలేమి, అజాగ్రత్త, ట్రాఫిక్ రూల్స్ పాటించపోవడం వంటి అనేకానేక కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు ఈ అంశాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు.