హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలోని జర్నలిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జష్న్-ఎ-సైన్మా(Jashn-e-Sainma) జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. రెండు రోజుల పాటు జరగనున్న ఆ ఈవెంట్ను వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఔత్సాహికులు, కళాకారులు తమ ప్రతిభను చాటి చెప్పేందుకు ఈ ఈవెంట్ అద్భుతమైన వేదికగా నిలువనున్నది. ఫిల్మ్ ఫెస్టివల్లో తొలి రోజు ఇండస్ట్రీ ప్రముఖులతో ఆసక్తికర ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించనున్నారు. రెండో రోజు ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్స్, షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్, నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి.
చిత్ర పరిశ్రమకు చెందిన శీష్ మహల్ ఫేమ్ రోహిత్ – శశి, సౌండ్ ఇంజినీర్ డా. సాజిదా ఖాన్, క్యాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్, దర్శకులు కొండావిజయ్, ఆదిత్య హసన్, నటుడు చైతన్య రావ్, ప్రముఖ విద్యావేత్తలు సత్యప్రకాశ్, డా వై శివానంద్ అతిథులుగా పాల్గొని విద్యార్థులతో అనుభవాలు పంచుకోనున్నారు. జష్న్-ఎ-సైన్మా ఈవెంట్ విజేతలకు భారీ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు.