ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్రికెట్ ఆటే వారిపాలిట మృత్యుపాశమైంది. ప్రహరీ మధ్య లో ఇరుక్కుపోయిన బంతిని తీసే క్రమంలో రావిచెట్టు కూలి ఇద్దరు బాలురు మృతిచెందగా పలువురు గాయపడ్డా రు. ఈ ఘటన ఖమ్మం నగరంలో మంగళవారం సాయం త్రం చోటుచేసుకున్నది. ఖమ్మంలోని బ్రాహ్మణ బజార్లోగల ఓ ఖాళీ స్థలంలో దిగాంత్ శెట్టి (11), ఆయుష్ (6) తమ స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బంతి పక్కనే ఉన్న ప్రహరీ మధ్యలోకి వెళ్లింది. పిల్లలు బంతిని బయటకు తీస్తున్న క్రమం లో ప్రహరీ మధ్యలో ఉన్న రావిచెట్టు ఒక్కసారిగా పిల్లలపై పడింది. ఘటనలో దిగాంత్ శెట్టి (11), ఆయుష్ (6) అక్కడికక్కడే మృతిచెందారు. సాకేత్, సాయి ఆర్యన్, చరణ్ సాయితోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. అనుమోల్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.