Warangal | వరంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలి రోజు ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.
భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న చందుపట్ల కీర్తి రెడ్డి తన నామినేషన్ను సమర్పించారు. వరంగల్ ఈస్ట్ నుంచి బరిలో ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ప్రదీప్ రావు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న గండ్ర సత్యనారాయణ రావు కూడా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించారు. ఇక వరంగల్ ఈస్ట్ నుంచి రాజనాల శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు.