న్యూఢిల్లీ, మే29 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సాధన కోసం కృషి చేస్తున్నామని టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం టీయూడబ్ల్యూజే ఢిల్లీ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్ అధ్యతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎక్కడా లేని విధంగా ఢిల్లీ కమిటీ సభ్యుల కుటుంబాల కోసం రూ.పది లక్షల బీమాను కల్పించడం గొప్ప విషయమని అభినందించారు. కమిటీని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర కమిటీ గుర్తించిందని, అలాంటి వారికి సరైన సమాధానం చెప్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్, ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, జాతీయ సభ్యులు వెంకటేష్ గౌ్డ లను ఢిల్లీ టీయూడబ్ల్యూజే కమిటీ సన్మానించింది. ఈ సమావేశంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, వెంకటేశ్గౌడ్, సభ్యులు ఢిల్లీ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, కోశాధికారి శిరీష్, కార్యదర్శి గోపి, రాజశేఖర్రెడ్డి, రవీందర్రెడ్డి, అశోక్రెడ్డి, కామరాజు, నాయక్ పాల్గొన్నారు.