మెట్పల్లి, ఫిబ్రవరి 26: ఈ సారి పసుపు ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది దిగుబడులు కాస్త తగ్గినా.. రేట్లు మాత్రం రోజురోజుకూ పైపైకి చేరుతున్నాయి. మెట్పల్లి వ్యవసా య మార్కెట్లో పసుపు క్రయవిక్రయా లు జోరుగా సాగుతుండగా.. సోమవారం క్వింటాల్కు గరిష్ఠంగా రూ.14,005 పలికింది. పసుపు కాడి (కొమ్ము)కు ఈ ధర పలుకడం ఈ సంవత్సరం ఇదే తొలిసారి. కనిష్ఠంగా రూ.5 వేలు పలికింది. పసుపు గోళ (మండ) క్వింటాల్కు గరిష్ఠంగా రూ.11,511, కనిష్ఠంగా రూ.5,001, పసుపు చూర క్వింటాల్కు గరిష్ఠంగా రూ.10,044, కనిష్ఠంగా రూ.6,060 పలికింది. ఇప్పటి వరకు మార్కెట్లో 3,446 క్వింటాళ్ల పసుపు క్రయవిక్రయాలు జరిగినట్టు మార్కెట్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు.