ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలని డిమాండ్
నందిపేట్, సెప్టెంబర్ 21: లోక్సభ ఎన్నికల సమయంలో అర్వింద్ ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో రైతులు మంగళవారం దీక్ష చేపట్టారు. ఎన్నికల సమయంలో అర్వింద్ రైతులకు రాసిఇచ్చిన బాండ్ పేపర్ను ఫ్లెక్సీగా తయారు చేయించి దీక్షా శిబిరం ముందు ప్రదర్శించారు. వెంటనే బోర్డు ఏర్పాటు చేయించాలని లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని వారు అర్వింద్ను డిమాండ్ చేశారు.